ఓ మలయాళ చిత్ర యూనిట్ కరోనా ఎఫెక్ట్ను పట్టించుకోకుండా విదేశాలకు షూటింగ్కు వెళ్లి ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటోంది. వివరాల్లోకెళ్తే.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కథానాయకుడిగా బ్లెస్సీ దర్శకత్వంలో ‘ఆడు జీవితం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ జోర్డాన్ ఎడారిలో జరుగుతోంది. అక్కడి పరిస్థితులు బాగోలేవని, షూటింగ్ ఆపేయాలని అధికారులు సూచించినా చిత్ర యూనిట్ వినిపించుకోలేదట. కానీ రాను రానూ కరోనా ప్రభావం తీవ్రతరం కావడంతో షూటింగ్ ఆగిపోయింది. మన దేశంలో లాక్డౌన్ ప్రకటించేశారు. దీంతో యూనిట్ సభ్యులు తిండి, తిప్పలు లేక ఇబ్బందుల పడుతున్నారట. దీంతో మలయాళ ఇండస్ట్రీ పెద్దలు యూనిట్ను ఇండియా రప్పించే ప్రయత్నం చేస్తున్నారట.