టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్పై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేస్తున్న కేంద్రం, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు టాలీవుడ్ హీరో ప్రభాస్ భారీ విరాళం ప్రకటించారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ ప్రభాస్ను అభినందించారు. బాహుబలి చిత్ర రికార్డుల్లోనే కాదు, కరోనా విరాళాల్లోనూ తెలుగు సినీ రంగంలో ప్రభాస్ ముందుండటం అభినందనీయమని మాజీమంత్రి సోమిరెడ్డి కొనియాడారు. చిన్న వయస్సులోనే పెద్ద మనస్సు చాటుకుంటూ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు, ఏపీ, తెలంగాణల సీఎంల సహాయనిధికి కోటి రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. తెలుగులో అనేకమంది స్టార్ హీరోలు ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు ఇచ్చినా... వారందరికంటే ఎక్కువగా హీరో ప్రభాస్ ఇందుకోసం నాలుగు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి అందరి దృష్టి ఆకర్షించారు.