ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కరోనా వైరస్ నేపథ్యంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. దీంతో, రకరకాలు ఛాలెంజ్ లను సెలబ్రిటీలు విసురుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'బీ ది రియల్ మ్యాన్', 'పిల్లో ఛాలెంజ్' వంటివి పుట్టుకొచ్చాయి. ఇలాంటి ఛాలెంజ్ లపై ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మీరు ఎవరికైనా ఛాలెంజ్ విసరాలనుకుంటే... ఎవరికి విసురుతారు? ఎలాంటి ఛాలెంజ్ విసురుతారు? అని వర్మను ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విస్కీ ఛాలెంజ్ విసరాలనుకుంటున్నానని చెప్పారు. మందు దొరక్క జనాలు ఇబ్బంది పడుతున్నారని... టీవీలో అందరికీ కనిపించేలా గ్లాస్ విస్కీ తాగి... అందరకీ కేసీఆర్ షాక్ ఇవ్వాలనేదే తన ఛాలెంజ్ అని అన్నారు.