పరశురామ్తో ఓ సినిమాను ఇప్పటికే ఓకే చేశాడు మహేష్ ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ఉన్న సందర్బంలో ఈ సినిమా అక్టోబర్నుండి షూటింగ్కు వెళ్లే అవకాశం ఉందట. కాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ నటించనుందని సమాచారం. ఇక అది అలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాజమౌళి ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆయన తన తదుపరి సినిమాను మహేష్తోనే చేయనున్నాడు. సినీనటుడు మహేశ్ బాబుకు సంబంధించి ఓ అభిమాని సృష్టించిన ఓ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన రాముడిగా కనపడుతున్నాడు. చేతిలో బాణం పట్టుకుని, కూల్గా మహేశ్ బాబు ఉన్నాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో షూటింగులు లేకపోవడంతో ప్రస్తుతం మహేశ్ బాబు ఇంట్లోనే ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు.ఈ సందర్భంగా ఆయన తన పిల్లలతో తీసుకున్న ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరించాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి తన తర్వాతి సినిమాను మహేశ్ బాబుతో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో మహేశ్ బాబు పాత్రపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ మహేశ్ బాబుతో రాజమౌళి 'రామాయణం' సినిమా చేస్తే అందులో మహేశ్ ఎలా ఉంటాడన్న విషయాన్ని ఊహిస్తూ ఓ అభిమాని ఈ పోస్టర్ను రూపొందించాడు.