కన్నడ టీవీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటి మెబీనా మైఖేల్(22) దుర్మరణం పాలయ్యారు కర్ణాటకలోని సొంతూరు మదికేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్కు ఢీ కొట్టడంతో తీవ్రగాయాల పాలైన మెబీనాను హాస్పిటల్కు తరలించారు. దేవిహిల్లి దగ్గర ఈ దారుణమైన ఘటన జరిగింది. ప్యాతే హుదుగిర్ అనే రియాలిటీ షోతో మెబీనా గుర్తింపు తెచ్చుకుంది. అందులో విన్నర్గా నిలిచింది ఈమె. అకుల్ బాలాజీ ఈ షోకు హోస్ట్గా ఉన్నాడు.సోషల్ మీడియాలో ఈమె మృతిపై సంతాపం వ్యక్తం చేసాడు అకుల్. ప్యాతే హుదుగిర్ విన్నర్.. తన ఫేవరెట్ కంటెస్టెంట్ మెబీనా మరణం తనకు జీర్ణించుకోలేనిదని.. ఇప్పటికీ ఈ విషయం తను నమ్మలేకపోతున్నానని ట్వీట్ చేసాడు అకుల్ బాలాజీ. అప్పట్లో ఆయన చేతుల మీదుగా ప్రైజ్ తీసుకుంటున్న పోటోను ట్వీట్ చేసాడు అకుల్.ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు పలువురు కన్నడ సినీ ప్రముఖులు. మెబీనా మోడల్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై క్రేజ్ పెంచుకుంది. 19 ఏళ్ల వయసులోనే రియాలిటీ షోకు వెళ్లి 12 మందిని దాటేసి విజేతగా నిలిచింది. ఇంత చిన్న వయసులోనే టాలెంటెడ్ నటిని కోల్పోవడం బాధాకరం అంటున్నారు కన్నడ సినీ ప్రముఖులు.