వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో నాలుగో సీజన్ ఆగష్టు నెలలో ప్రారంభం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి జూన్, జూలై నెలల్లో బిగ్ బాస్ షో గత సీజన్లను మొదలుపెట్టారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఆగష్టుకి వెళ్లింది సీజన్ 4. అయితే ఇంకా హోస్ట్, కంటెస్టెంట్స్ లిస్ట్ పెండింగ్లోనే ఉండటంతో మరింత ఆలస్యం అయినా.. ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. తెలుగులో బిగ్బాస్ ఇప్పటి వరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షో తెలుగులో ఎంత ఆదరణ దక్కించుకుందంటే ఈ షో ధాటికి కొన్ని సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. అంతలా ఆకట్టుకుంది. పోయిన సీజన్ను నాగార్జున హోస్ట్ చేయ్యగా.. అంతకు ముందు నాని, ఎన్టీఆర్లు తమ యాంకరింగ్తో సందడి చేశారు. అయితే కరోనా లేకపోయింటే ఇప్పుటికే ఈ షోకు సంబందించిన సన్నాహాలు, హాడావిడి జరుగుతుండేది. గత మూడు సీజన్లను చూసినట్లయితే బిగ్ బాస్ షో మార్చి ఏప్రిల్ నుండే ఏర్పాట్లు ప్రారంభం అవ్వుతుండేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్బాస్ షో ఉంటుందా అసలు ఉండదా అనే అనుమానాలు ఉండేవి. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ షో నిర్వాహకులు కొత్త సీజన్ కోసం సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు ఈ సీజన్లో పాల్గొనే వారు కూడా కొంతమంది ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా హైపర్ ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ షో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు నుండి ప్రారంభంకానుందని తెలుస్తోంది. మరోవైపు నాలుగో సీజన్కు కూడా నాగార్జున మరోసారి హోస్ట్గా చేసే అవకాశం మెండుగా ఉందని సమాచారం. అది అలా ఉంటే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ విషయంలోనే కాస్త విషయం తారుమారు అయ్యినట్టుందని తెలుస్తుంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ షోలో పాల్గొనేందుకు పలువురు పాపులర్ సెలెబ్రెటీలు మొగ్గు చూపడం లేదట. దీనికి కారణం కరోనాయే అని తెలుస్తుంది.