ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా అన్ని రకాల షూటింగ్స్ రద్దు చేయబడ్డాయి. వచ్చే నెల నుంచి షూటింగ్స్ చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది టీవీలు చూసే తెలుగువారికి కార్తీకదీపం లేదా జబర్దస్త్ అంటే ఏమిటో ఊరికే చెప్తారు. మాటీవీలో వచ్చే కార్తీక దీపం సీరియల్ అయితే తెలుగు మహిళలు అతి ఇష్టంగా చూసే సీరియల్స్లో ప్రధానమైంది. దీంతో అత్యంత ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ మాటీవీకి వచ్చేవి. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్కు వచ్చేవి. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా కొత్త ఎపిసోడ్స్ ప్రసారం అవట్లేదు. దీంతో ఈ షోలకు టీఆర్పీ రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. కరోనా లాక్ డౌన్ ముందు ఎప్పుడైనా ఏదైనా చానెల్ లో కొత్త సినిమా వచ్చినప్పుడు మాత్రమే ఈ రెండు షోలకూ ఆదరణ కాస్తంత తక్కువగా ఉండేది. ఇప్పుడు అంతా తలకిందులైంది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై నిత్యం వస్తున్న కొన్ని ఆసక్తికర సినిమాలు, వార్తలు, ప్రత్యేక కార్యక్రమాలకు టీఆర్పీ పెరిగింది. ఇదే సమయంలో సీరియల్స్, రియాల్టీ షోల షూటింగ్స్ జరగకపోవడంతో ఈ టీవీలో జబర్దస్త్ పాత ఎపిసోడ్ లు ప్రసారం అవుతుండగా, మాటీవీలో కూడా కార్తీకదీపం సీరియల్ ను రిపీట్ చేస్తున్నారు. దీంతో వీటి రేటింగ్ పడిపోయిందట. ఎప్పుడూ తొలి రెండు స్థానాల్లో ఉండే ఈ కార్యక్రమాలు కిందకు దిగాయి. అయితే లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్కు అనుమతిస్తే మళ్లి పుంజుకునే అవకాశం మాత్రం మెండుగా ఉంది.