రాశిఖన్నా తాజాగా సూర్య తో యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కించనున్న చిత్రాన్ని అంగీకరించింది. లాక్డౌన్ కావడంతో ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. త్వరలో లాక్డౌన్ ముగియనుండటంతో అంతా షూటింగ్ ఏర్పాట్లులో నిమగ్నమవుతున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ సోయగం తెలుగు నేర్చుకుని కొన్ని చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.తమిళంలోనూ సూర్య సినిమాకి తానే డబ్బింగ్ చెప్పాలని ఫిక్సయిందట. ఇందులో భాగంగా తమిళ భాషపై పట్టు సాధించడం కోసం కుస్తీ పడుతోంది. ఈ సందర్భంగా రాశి పెట్టిన పోస్ట్ ఆకట్టు కుంటోంది. `మళ్లీ స్కూల్కి వచ్చినట్టుగా వుంది. తమిళ భాష నేర్చుకుంటున్నాను. ఇందుకు ఓ టీచర్ని కూడా అపాయింట్ చేసుకున్నాను. ఆమె పేరు లీలా. ప్రస్తుతం క్లాస్ వర్క్ , హోమ్ వర్క్, క్లాస్ టెస్ట్లతో బిజీగా వున్నాను` అని ట్వీట్ చేసింది