cinema | Suryaa Desk | Published :
Thu, May 28, 2020, 10:23 AM
అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా 'అమర్ అక్బర్ ఆంటోనీ' విడుదలై 43 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సమయం లోనే పలు భాషల్లో సైతం రీమేక్ అయ్యి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.7.25 కోట్లు రాబట్టిందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ సందర్భంగా అమితాబ్ ట్విట్టర్ వేదికగా 'అమర్ అక్బర్ ఆంటోనీ' బాహుబలిని బీట్ చేసింది అని పేర్కొన్నారు. ఆ రోజుల్లోనే 'అమర్ అక్బర్ ఆంటోనీ' రూ.7.25 కోట్లు రాబట్టినట్లు అంచనా వేశారు. ఆ మొత్తాన్ని అన్ని విధాలుగా లెక్కిస్తే 'బాహుబలి: ది కన్క్లూజన్' వసూళ్లను అధిగమిస్తుంది' అని పేర్కొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com