సోషల్ మీడియా అనేది ఇప్పుడు స్టార్స్ చేతుల్లో ఉన్న ఒక ప్రధాన ఆయుధం. ఒకప్పుడు స్టార్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వాలన్న మీడియా ద్వారా వివరణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి రూమర్స్ వచ్చినా ధైర్యంగా అసలు విషయాలని సోషల్ మీడియా ద్వారా బయట పెడుతున్నారు.కథానాయిక పూజా హెగ్డే ఇన్ స్టాగ్రాం అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయం గురించి పూజ చెబుతూ, 'నా అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.. కాబట్టి ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోకండి..అలాగే ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో పంచుకోకండి' అంటూ ట్వీట్ చేసింది.