హీరోయిన్ గానూ, ప్రజా ప్రతినిధిగానూ, టీవీ వ్యాఖ్యతగా ఓ వెలుగు వెలుగుతున్న ఆర్కే. రోజా అంటే తెలుగు నాట పరిచయం లేని పేరు. తెలుగులో టాప్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు తమిళనాట సూపర్ స్టార్ రజినీ కాంత్, విజయ్ కాంత్ లతో రోజా ఓ వెలుగు వెలిగింది. కొంతకాలం సినిమాల నుంచి విరామం తీసుకుని రాజకీయాల్లో అడుగు పెట్టీ ఎమ్మెల్యేగా రాణించి.. ఫైర్ బ్రాండ్ లేడీగా పేరు తెచ్చకున్నారు. మరోవైపు టెలివిజన్ రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతోంది రోజా. టాలివుడ్, బాలివుడ్ లలో చాలా మంది హీరోయిన్లు తాము ప్రేమించిన దర్శకులనే పెళ్లి చేసుకున్నారు. ఆ లిస్ట్లో రోజా కూడా ఒకరు. వాస్తవానికి రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు `చెంబరుతి` చిత్రం ద్వారా పరిచయం చేసింది డైరెక్టర్ సెల్వమణి. ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సెల్వమణి, రోజా మధ్య పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారి.. చివరకు మూడు ముళ్ల బంధంతో 2002లో ఒక్కటయ్యారు. అయితే రోజా, సెల్వమణి వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ, వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎలా కొనసాగిందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. వాస్తవానికి సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు కాకుండా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పారట. రోజా తండ్రిని ఒప్పించుకుని ఆ తర్వాత రోజాకు విషయం చెప్పాడట సెల్వమణి. ఇక రోజా కూడా సెల్వమణి ప్రేమ కోసం చాలా కష్టపడిందట. ఆయన కోసం తమిళం మాట్లాడటం, చదవడం కూడా నేర్చుకుందట. చివరకు ప్రేమించిన దర్శకుడినే పెళ్లాడి.. లైఫ్ను హ్యాపీగా రన్ చేస్తున్నారు. అయితే 1994లో సమరం అనే ఓ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని స్వయంగా రోజా నిర్మాతగా అందులో సుమన్, రోజా, రఘుమాన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ కె సెల్వమణి నిర్వహించగా, శ్రీ సాయిరోజా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చరు. కాగా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యింది. దీంతో రోజాకు ఆర్థిక నష్టాలు తప్పలేదు. ఇలా తన భర్త తీసిన సినిమా వల్ల రోజాకు ఆర్థికంగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.