కొన్ని వేల మంది వలస కార్మికులకు అండగా నిలుస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు సోనూ సూద్ . తన సొంత ఖర్చుతో బస్సులను ఏర్పాటు చేసి వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపిస్తున్నాడు.కొవిడ్ చికిత్స కోసం పనిచేస్తున్న వైద్య సిబ్బంది బస కోసం ముంబైలోని తన హోటల్ను ఇచ్చాడు. బస్సు సేవలు, ఇతర సహాయాల కోసం ఎంతో మంది సోనూను సోషల్ మీడియా ద్వారా సంప్రదిస్తున్నారు. తాజాగా సోనూ సూద్ తన మొబైల్ నోటిఫికేషన్ బార్ను తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నాడు. `మీ సందేశాలు ఎంతో వేగంతో మాకు చేరుతున్నాయి. ప్రతి ఒక్కరికి సహాయం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ కొందరి అభ్యర్థనలను మేం మిస్ అయినట్టైతే.. క్షమించండి` అని పేర్కొన్నాడు.