ఇప్పటికే కరోనాపై రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు వీడియో కూడా రిలీజ్ చేశారు.ఇక యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా కరోనా నేపథ్యంలో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబందించిన ప్రీ లుక్ రేపు ఉదయం 9:00 విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుంది. దీని ప్రభావం దేశాలపై మరియు ప్రజలపై ఎంత దారుణమైన ప్రభావం చూపిస్తుంది, వ్యాక్సిన్ వస్తే ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా చర్చించనున్నాడట. ఈ చిత్రం సరికొత్తగా ప్రేక్షకులని అలరించేలా ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ చివరిగా కల్కి అనే చిత్రాన్నితెరకెక్కించిన విషయం తెలిసిందే.