ముంబై బ్యూటీ కామ్నా జెట్మలానీ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. రమణ్, బెండు అప్పారావు ఆర్ఎంపీ, కింగ్, కత్తి కాంతారావు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించింది. 2015లో వచ్చిన చంద్రిక అనే చిత్రంలో చివరిగా నటించిన కామ్నా మళ్లీ టాలీవుడ్కి రీఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
ఐదేళ్ళ తర్వాత కామ్నా నటిస్తున్న తెలుగు చిత్రం లేడి ఓరియెంటెడ్ మూవీ కాగా, ఇది థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకులని అలరిస్తుందని అంటున్నారు. నూతన దర్శకుడు ప్రభు దర్శకత్వంలో తెరక్కనున్న ఈ చిత్రంలో కామ్నా తల్లి పాత్రలో కనిపించనుందట. 2014లో సూరజ్ నాగ్ పాల్ అనే బిజినెస్ మ్యాన్ని వివాహం చేసుకున్న కామ్నా లీడ్ రోల్లో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతుంది