హీరోయిన్ తాప్సీ ఇంట్లో విషాదం జరిగింది. తాప్సీ ఎంతగానో ఇష్టపడే ఆమె బామ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని తాప్సీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా తాప్సీ ఫోటో షేర్ చేసి భావోద్వేగానికి గురయ్యారు. ‘కుటుంబంలోని ఆ తరం వాళ్లు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారు’ అని సందేశం రాశారు. ఈ రోజు తమకు చీకటి రోజని ఆమె పేర్కొన్నారు. తాప్సీ తెలుగులో ఝమ్మంది నాధం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.