జబర్ధస్త్ షో తో పాపులర్ అయిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన లక్ను పరీక్షించుకుంది. ‘సోగ్గాడే చిన్నినాయనా..క్షణం, రంగస్థలం వంటి సినిమాలు నటిగా అనసూయకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అనసూయ ప్రధాన పాత్రలో కథనం వంటి కొన్నిచిత్రాలు వచ్చినా.. నటిగా ఆమెకు అంతగా వర్కౌల్ కాలేదు. అందుకే కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తాజాగా అనసూయ భరద్వాజ్.. పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ భామ.. తన దృష్టిని రాజకీయాలపై మళ్లించబోతున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీతో పాటు పలు పార్టీలు ఆమెను తమ పార్టీలో చేరమని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఆమెను అడిగినట్టు సమాచారం. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నేతలు అనసూయతో చర్చలు జరిపినట్టు సమాచారం. కానీ అనసూయ మాత్రం రాజకీయ ఆరంగేట్రంపై తన సన్నిహితులతో చర్చిస్తోంది. ఇపుడిపుడే రాజకీయాలు అవీ వద్దు అన్నట్టు ఆమె సన్నిహితులు వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ప్రస్తుతం అనసూయ కెరీర్..మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్లు సాగుతోంది. ఇలాంటి సమయంలో రాజకీయాల్లో అడుగుపెట్టి ఎటూ కాకుండా పోతే.. తర్వాత పరిస్థితి ఏమిటనే విషయమై ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా అనసూయ తన రాజకీయ ఎంట్రీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక అనసూయ ‘రంగస్థలం’ సినిమాలో రాజకీయ నేతగా కనిపించిన సంగతి తెలిసిందే కదా.