ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి, రామ్ చరణ్ పై తేనెటీగల దాడి

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 01, 2020, 05:35 PM



మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం చరణ్ భార్య ఉపాసన తాత గారు అయిన కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆయన మృతదేహాన్ని బయటకు తీసుకొస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవి, రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసనను ప్రమాదం నుంచి తప్పించారు. ఉపాసన తాత కామినేని ఉమాపతిరావు ఈ నెల 27న మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలను ఈరోజు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవి దోమకొండకు వచ్చారు. అంత్యక్రియల కార్యక్రమం సాగుతున్న సమయంలో స్థానికంగా ఉన్న చెట్టుపై నుండి తేనేటీగలు దాడికి దిగాయి. తేనేటీగలు కుట్టడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com