వరస ప్లాప్ లలో కూరుకుపోతున్న అఖిల్ ను బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందా.. అనేది సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రం కథేంటి అనేది హాట్ టాపిక్ అవటంలో వింతేముంది.అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకం. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం కానుంది. ఇక మరోవైపు నాగార్జున తన కొడుక్కు మంచి హిట్ ఇవ్వాలనే ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందులో భాగంగా నాగార్జున లాక్ డౌన్తో వచ్చిన ఖాళీ సమయంలో అఖిల్ సినిమా ఎలా వచ్చిందో అని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా ఔట్ పుట్ తెప్పించుకుని, రఫ్ ఎడిటింగ్లో ఉన్న సినిమా మొత్తాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశాడట. అయితే సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ విషయంలో మాత్రం కొన్ని మార్పులు చేయమని దర్శకుడికి చెప్పాడట నాగార్జున. దీంతో భాస్కర్ నాగార్జున సూచించిన మార్పులను తాజాగా పూర్తి.. ఈ కొత్త వెర్షన్ను నాగార్జునకు చూపించాడట. ఈ వెర్షన్ను చూసిన నాగ్ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నాడట. తన కొడుకు సినిమా చాలా బాగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాడట. సినిమా మంచి విజయం సాధిస్తుందని గట్టినమ్మకంతో ఉన్నాడట. ఇక మరోవైపు కరోనా దెబ్బకు ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగష్టుకు మారే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ చిత్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే అఖిల్ సరసన నటిస్తోంది. దీంతో సినిమాకు మరింత బజ్ రానుంది. ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.