మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్పై ఓ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారట. స్క్రిప్ట్ను కూడా తయారు చేయించారట. అయితే ఏమైందో ఏమో కానీ చివరకు రామ్చరణ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో యువీ క్రియేషన్స్ అధినేతలు ఆ స్క్రిప్ట్ను శర్వానంద్తో తెరకెక్కించాలని చూస్తున్నారట. అయితే ప్రస్తుతం ‘శ్రీకారం’ సినిమా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా, ‘మహా సముద్రం’ సినిమాలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీలో శర్వానంద్ యువీ క్రియేషన్స్ సినిమాకు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారో వేచి చూడాలి.