ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ బయోపిక్ ను తిరస్కరించిన నిత్యా...

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 02, 2020, 02:48 PM



కరణం మల్లీశ్వరి!


మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో భారతీయ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై ఇనుమడింపజేసిన క్రీడాకారిణి. ఒలింపిక్స్ లో భారత్ కు పతకాన్ని సంపాదించిపెట్టిన ఈ తెలుగుతేజం కథ వెండితెరకు ఎక్కనున్న సంగతి విదితమే. నిన్న ఆమె జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఎంవీవీ సత్యనారాయణతో కలసి ఈ బయోపిక్ ను తాను నిర్మిస్తున్నట్టు ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రకటించారు. దీనికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.


ఇక పాన్ ఇండియా చిత్రంగా దీనిని నిర్మించాలని నిర్మాతలు భావిస్తున్నందున ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించడానికి సత్తా వున్న నటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రముఖ నటి నిత్యా మీనన్ ను నటించాల్సిందిగా దర్శక నిర్మాతలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే, ఆమె ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఆమె ఈ ఆఫర్ ని ఎందుకు తిరస్కరించిందన్న దానిపై కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com