క్రికెటర్ మహ్మద్ షమీ, హాసిన్ జహాన్.. ఈ భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న మనస్పర్థల కారణంగా విడివిడిగా ఉంటున్నారు. షమీపై 2018లో హాసిన్ వేధింపుల కేసు కూడా పెట్టింది. వీలు దొరికినప్పుడల్లా షమీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే, తాజాగా ఇన్స్టాగ్రామ్లో షమీతో కలిసి అర్ధనగ్నంగా దిగిన ఫొటోను పోస్ట్ చేసి, అతడిపై పలు ఆరోపణలు చేసింది. ‘నీకేం లేనప్పుడు నన్ను ఆరాధించావు. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి. నేనే మలినం అయిపోయా. నిజం, అబద్ధాలు ఎప్పటికీ దాగవు’ అంటూ సెన్సేషనల్ పోస్ట్ చేసింది. కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, పోస్టులు పెట్టడం చేస్తోంది. అయితే, షమీ మాత్రం ఎప్పుడూ ఈ విషయాలపై నోరు మెదపలేదు.
కాగా, హాసిన్ చేసిన పోస్ట్ చూసి షమీ అభిమానులు ఖంగు తిన్నారు. షమీ కెరీర్ను దెబ్బతీసి, ఇప్పుడు కొత్త నాటకం ఆడుతోందంటూ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాను 2018లో మూడు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని.. ఓ సమయంలో క్రికెట్ గురించి కూడా ఆలోచించలేదని షమీ చెప్పుకొచ్చాడు.