ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు అగ్ర హీరో అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి మీరా చోప్రా

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 03, 2020, 11:20 AM



సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనను సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారని నటి మీరా చోప్రా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్టీఆర్‌ కంటే మహేశ్ బాబునే తాను ఎక్కువగా ఇష్టపడతానని ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తారక్ అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతూ ఆమెను దూషిస్తున్నారు.


దీనిపై ఎన్టీఆర్ స్పందించాలని ఇప్పటికే ఆమె ట్విట్టర్‌లో కోరింది. అయితే ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. దాంతో తనను వేధిస్తున్న నెటిజన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ట్విట్టర్‌ ద్వారా పోలీసులను కోరారు. తనను దూషిస్తూ కొందరు చేసిన ట్వీట్లను ఆమె పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లను గుర్తించి వెంటనే ఆయా అకౌంట్లను తొలగించాలని ట్విట్టర్‌ను కూడా ఆమె కోరారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. #WeSupportMeeraChopra హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com