తెలుగు ఇండస్ట్రీలో కేవలం యాంకర్గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇప్పుడిప్పుడే ఈమె మంచి మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. సుకుమార్ లాంటి దర్శకులు అనసూయను నమ్మి మంచి పాత్రలే ఆఫర్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అనసూయ మాత్రం తెలుగు దర్శకులపై సంచలన కామెంట్స్ చేసింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండి అభిమానులతో ఛాటింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం మొహమాటం లేకుండా సమాధానాలు చెబుతుంది.
పర్సనల్ విషయాలను కూడా బాగానే పంచుకుంటుంది అనసూయ. ఇదిలా ఉంటే ఈ మధ్యే చేసిన లైవ్ ఛాట్లో ఓ అభిమాని ఇప్పటి వరకు తెలుగులో మీకు ఛాలెంజింగ్గా అనిపించిన పాత్ర ఏంటి అని అడిగాడు.. దీనికి చాలా మంది రంగమ్మత్త సమాధానంగా వస్తుందని అనుకున్నారు.. కానీ చిత్రంగా ఇప్పటి వరకు తనకు తెలుగులో ఛాలెంజింగ్ రోల్ ఇచ్చిన వాళ్లే లేరంటూ సమాధానమిచ్చింది. దీనిపై కొందరు అనసూయపై సెటైర్లు కూడా వేస్తున్నారు.
రంగమ్మత్త పాత్ర మీకు ఛాలెంజింగ్గా అనిపించలేదా.. అంత ఈజీగా చేసారా అంటూ సుకుమార్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. మిమ్మల్ని నమ్మి అంత మంచి పాత్ర ఇస్తే దాన్ని కూడా మీరు ఛాలెంజింగ్ అనుకోలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ భామను. రంగమ్మత్త పాత్ర తనకు పేరు తీసుకొచ్చినా కూడా.. తను అనుకున్నంత ఛాలెంజింగ్ కాదని ఫీల్ అవుతుంది అనసూయ.
అలాంటి పాత్రల కోసమే వేచి చూస్తున్నట్లు చెప్పింది. అంతేకాదు.. మిస్సమ్మ, అరుంధతి, కర్తవ్యం ఈ మూడు సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే ఏది చేస్తారని అడిగితే.. తాను రీమేక్ సినిమాలకు దూరమని చెప్పింది. ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం మూడు చేస్తానంటుంది అనసూయ భరద్వాజ్. అంతేకాదు తమిళ ఇండస్ట్రీకి కూడా వెళ్తున్నట్లు ప్రకటించింది అనసూయ. మొత్తానికి ఈమెకు ఛాలెంజింగ్ రోల్ ఇవ్వడానికి ఏ దర్శకుడు దిగి రావాలో మరి..?