మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట’. సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ను అనౌన్స్ చేస్తూ టైటిల్ లోగోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్ 27 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంకేముంది, సోషల్ మీడియాలో ఎంబీ ఫ్యాన్స్ కోలాహలం మిన్నంటింది.ఇక అసలు విషయానికొస్తే.... ఆదివారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజైన 'సర్కారు వారి పాట' టైటిల్ పోస్టర్ టాలీవుడ్ రికార్డు సృష్టించింది.ఈ సినిమా లో బాలీవుడ్ భామ కైరా అద్వానీ మరోసారి మహేశ్ బాబుతో జతకట్టనుంది. ఆమధ్య వీరిద్దరూ కలసి నటించిన 'భరత్ అనే నేను' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అప్పటి నుంచీ మళ్లీ ఈ జంట ఎప్పుడు జోడీ కడుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కైరా త్వరలో మహేశ్ సరసన నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం తర్వాత మహేశ్ తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేస్తున్నాడు. దీనికి 'సర్కారు వారి పాట' అనే గమ్మత్తయిన టైటిల్ని నిర్ణయించిన సంగతి, ఇటీవలే దీని పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి విదితమే. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు కైరా అద్వానీని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో చిత్రం యూనిట్ ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతోందనీ, ఈ సినిమా పట్ల కైరా ఆసక్తి చూపుతోందని తాజా సమాచారం. తాను బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ చిత్రం కోసం ఈ ముద్దుగుమ్మ డేట్స్ అడ్జస్ట్ చేసుకోనుందట.