లాక్ డౌన్ వేళ ఉపాధి కోల్పోయి తిండి లేక సొంతూరు చేరుకునే మార్గం లేక వాళ్ళు పడుతున్న అవస్థలు చూసి వేల కిలోమీటర్లు పిల్లలతో కొంత మంది కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడిచి వెళుతుంటే మనసు చలించిపోయి వారి కోసం సోనూసూద్ చేస్తున్న కృషి అందరికి తెలిసిందే. అయితే తెలియని విషయం ఏమిటంటే.. ఇతనిని అందరూ దేవుడిలా భావిస్తుంటే.. ఇంకో అడుగు ముందుకేసి ఓ అభిమాని దేవుడికి చేయాల్సిన పూజలు సోనుసూద్ ఫొటోకు చేస్తున్నాడు. ఈ విధంగా తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.అతని పేరు మనీష్. లాక్డౌన్లో వేరే ప్రాంతంలో ఇరుక్కుపోయిన అతన్ని తల్లి వద్దకు చేర్చిన సోనూసూద్ను దేవుడిలా భావిస్తున్నాడు. 'అందుకే దేవుడికి చేయాల్సిన పూజలు మా దేవుడు సోనుసూద్కు చేస్తున్నా' అంటూ ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు మనీష్. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. వీడియో చూసిన సోను సూద్ వెంటనే రిప్లై ఇచ్చాడు. 'తమ్ముడూ నువ్వు అలా చెయొద్దు. రోజు అమ్మను నా కోసం ప్రార్థించమని చెప్పండి. అంతా బాగుంటుంది' అని రీట్వీట్ చేశాడు. ఈ వీడియోకు కొంతమంది పాజిటివ్గా కామెంట్లు పెడుతుంటే మరికొందరేమో.. ఇతను జూనియర్ ఆర్టిస్ట్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నాడేమో' అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే బతికున్న మనిషికి అగరబత్తులతో్ పూజ చేయకూడదంటూ మనీష్కు క్లాస్ పీకుతున్నారు.