తెలుగు చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటి సిమ్రాన్. తెలుగులో అగ్ర హీరోలందరితోనూ నటించింది. ఆ తర్వాత ఓ ఇంటికి కోడలైన తర్వాత వెండితెరకు దూరమైంది. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అది క్లిక్ కాలేదు. ఈ నేపథ్యంలో 'చంద్రముఖి' సీక్వెల్ చిత్రంలో సిమ్రాన్ నటించనుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'చంద్రముఖి'. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. కలెక్షన్లు అయితే అదిరిపోయాయి. అయితే త్వరలోనే 'చంద్రముఖి 2' తెరకెక్కించే పనిలో బిజీగా ఉంది మూవీ యూనిట్. రాఘవ లారెన్స్ ఇందులో యాక్ట్ చేస్తున్నాడు. ఈ స్వీక్వెల్లో నటి సిమ్రాన్ నటించనుందనే వార్తలు వినిపించాయి. తాజాగా వాటిపై స్పందించింది ఈ అందాల తార. అవన్నీ రూమర్స్ అని స్పష్టం చేసింది. క్లారిటీ లేకపోతే ఇటువంటి వార్తలను రాయకుండా ఉండాలని కోరింది.1997లో విడుదలైన 'వి.ఐ.పి' అనే తమిళ మూవీతో హీరోయిన్ గా వెండితెర ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్. ఫస్ట్ మూవీతోనే ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. అదే ఏడాది తెలుగులో విడుదలైన 'అబ్బాయి గారి పెళ్లి'లో నటించి టాలీవుడ్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్బాబుతో కూడా ఆమె ఆడిపాడింది.