ఇటీవల శర్వానంద్, సమంత మొదటిసారిగా జంటగా నటించిన సినిమా జాను. దిల్ రాజు నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘జాను’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.రివ్యూలన్నీ సూపర్ పాజిటివ్ గా వచ్చాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ..టాక్ కు సంభందం లేకుండాపోయింది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. నూతన దర్శకుడు శ్రీరాం రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఇదిలావుంచితే, శర్వానంద్ నటించిన 'శ్రీకారం' చిత్రం విడుదలకు సిద్ధం కాగా, మరోపక్క అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' చిత్రాన్ని చేస్తున్నాడు.