ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తే "రైతు" తీస్తానంటున్న దర్శకుడు కృష్ణవంశీ..

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 04, 2020, 11:48 AM



నందమూరి బాలకృష్ణ ఒక్క చాన్స్ ఇస్తే ఆయనతో బ్లాక్ బస్టర్ సినిమా తీస్తానని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అన్నాడు. వారిద్దరూ కలసి రైతు అనే సినిమా తీస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రాజెక్టుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.


బాలకృష్ణ 100వ చిత్రంగా ‘రైతు’ సినిమాను కృష్ణ వంశీ డైరెక్ట్ చేస్తాడంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు బాలయ్య గనక డేట్స్ ఇస్తే ఆయనతో రైతు సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టిస్తానని చెబుతున్నాడు. అయితే, దీనికి బాలయ్య పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పట్టాలు ఎక్కుతుందో తెలీదు. ‘రైతు’ సినిమాలో రాష్ట్రపతి పాత్ర కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని కూడా అనుకున్నారు బాలయ్య.  ఓ దశలో ‘రైతు’ బాలయ్య వందో సినిమా ‘రైతు’ అవుతుందని కూడా ప్రచారం జరిగింది.  అమితాబ్ బచ్చన్ ఈ పాత్రకు ఓకే అంటే కానీ ‘రైతు’ సినిమా చేయనని బాలకృష్ణ ఖరాఖండీగా చెప్పేశాడు.


అమితాబ్ బచ్చన్ నుంచి సమాధానం రాకపోవడంతో పాటు చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఒప్పుకోవడంతో బాలయ్య..అమితాబ్ పై మాట తూలారు.  ప్రస్తుతం బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నారు.  బోయపాటి శ్రీను చిత్రంలో బాలకృష్ణ కవల సోదరులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకటి అఘోరా పాత్ర అయితే.. రెండోది ఫ్యాక్షనిస్ట్.  దర్శకుడు కృష్ణవంశీ హిట్ సినిమా ఇచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. కృష్ణవంశీతో కలిసి ముంబాయిలో సర్కార్ సెట్లో అమితాబ్ బచ్చన్‌ను కలిసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ శైలిని పరిశీలిస్తున్న బాలకృష్ణ. అసలు బాలయ్య ముందుగా తన తండ్రి బయోపిక్‌ను వర్మ దర్శకత్వంలో చేస్తానని చెప్పాడు. 


ఆ తర్వాత బాలయ్య సన్నిహితులు వద్దని వారించడంతో తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవం చేసాడు. ఆ తర్వాత తేజ ఎన్టీఆర్ వంటి మహానటుడు బయోపిక్ తీయడం తనవల్ల కాదంటూ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత క్రిష్.. ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసాడు. కానీ అనూహ్యంగా రెండు భాగాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయింది.  కొన్ని రోజుల క్రితం నక్షత్రం అనే ఫ్లాప్ సినిమాను తీశాడు కృష్ణవంశీ.  మరోవైపు నాగార్జునతో కలసి కూడా ఓ సినిమాను చేయాలని కృష్ణవంశీ ప్లాన్ చేస్తున్నాడు.  అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ తీసే సత్తా తన దగ్గర ఉందని కృష్ణవంశీ అభిప్రాయపడ్డాడు. తండ్రి అక్కినేని  నాగేశ్వరరావు బయోపిక్ తీయాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నాగార్జునేనని కృష్ణవంశీ చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com