2015లో పరిటాల రవి చనిపోయే నాటికి రాయలసీమలో ఆయనకు సెపేరేట్ క్రేజ్ ఉండేది. అప్పట్లో ఏదో ఇష్యూపై ఆయన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు గుండు కొట్టించారనే ప్రచారం జరిగింది. దీనిపై అప్పట్లో ఒక ఇంగ్లీష్ పత్రిక ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. దానికి నిరసనగా పవన కళ్యాణ్ ఆ పత్రికా ఆఫీసు ముందు ధర్నా కూడా చేసారు. ఐతే.. వపన్ కళ్యాణ్ మాత్రం తాను అప్పట్లో అందరిలాగే నేను కూడా గుండు చేయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక పరిటాల రవిని తాను ఎప్పుడు కలవలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే నటి రోజా మరోసారి ఈ ఇష్యూను బయటకు తీసింది. అపుడు పవన్కు గుండు కొట్టించింది టీడీపీ అని.. 2014లో కూడా పవన్ కళ్యాణ్కు గుండు కొట్టించారని.. ఒక 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్కు తెలుగు దేశం పార్టీనే మరోసారి గుండు కొట్టిస్తుందని సెటెర్లు వేసింది. రోజా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాట్లాడిన ఈ వీడియో ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వీడియోను హీరోయిన్ పూనమ్ కౌర్ లైక్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై ఒకవైపు విమర్శలు గుప్పిస్తూనే.. మరోవైపు వెనకేసుకొచ్చింది పూనమ్ కౌర్. తాజాగా రోజా.. పవన్ కళ్యాణ్ గుండు పై చేసిన వ్యాఖ్యలను ఈమె లైక్ చేయడం హాట్ టాపిక్గా మారింది.