నిజంగానే బాలయ్య అన్న మాటలతో చిరంజీవి బాగా నొచ్చుకున్నాడని.. అందుకే ఈయన ఇకపై అధ్యక్షతకు కూడా దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. మీటింగ్కు బాలకృష్ణను పిలవకపోవడం.. భూములు పంచుకుంటున్నారని ఆయన సీరియస్ కావడం.. ఆ తర్వాత అవి చాలా పెద్ద రచ్చకు దారి తీయడంతో చిరంజీవి బాగానే హర్ట్ అయినట్లు తెలుస్తుంది. అందుకే ఇకపై అన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ విషయంలో అయినా కూడా బాలయ్య తొందరపడి మాట్లాడటం అలవాటే అని చిరంజీవికి బాగా సన్నిహితమైన వ్యక్తి ఒకరు చెప్తున్నారు.
బాలయ్య ఏంటో చిరంజీవికి కూడా తెలుసు.. వాళ్లిద్దరూ బాగానే ఉంటారు. కానీ మధ్యలో కొందరు మాత్రం బాలయ్యకు వత్తాసు పలుకుతూ ఇష్యూను మరింత సీరియస్ చేస్తున్నారు.. దాంతో చాలామంది చిరంజీవి నాయకత్వంపై విముఖతతో ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నారని ఆయనకు బాగా కావాల్సిన వాళ్లే చెప్తున్న మాట. ఇకపై ఇలాంటి విషయాలకు దూరంగా ఉండి హాయిగా తన పనులు తాను చేసుకోవాలని చిరు భావిస్తున్నట్లు తెలుస్తుంది. నలుగురితో నారాయణ అన్నట్లు ఇండస్ట్రీలో మిగిలిన సినిమాల షూటింగులు ఎప్పుడు మొదలైతే అప్పుడే చిరంజీవి ఆచార్య షూటింగ్ కూడా అప్పుడే మొదలవుతుందని తెలుస్తుంది.
ఇకపై దీని గురించి చిరు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని ఫిక్సైపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఎలాగూ సినిమాను కూడా 2021కి వాయిదా వేయడంతో చాలా టైమ్ ఉంది. అందుకే చిరంజీవి కూడా ఈ ఇండస్ట్రీ విషయాలకు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకుంటున్నాడని చెప్తున్నారు సన్నిహితులు కూడా. ప్రస్తుతం ఈయన ఆచార్యతో పాటు లూసీఫర్ రీమేక్కు కూడా కమిటయ్యాడు. వచ్చే ఏడాది ఇది మొదలు కానుంది. సుజీత్ దీనికి దర్శకుడు. ఆ తర్వాత కూడా రెండు మూడు కథలు లైన్లో పెట్టాడు మెగాస్టార్.