తెలంగాణలో కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో మరో సారి లాక్ డౌన్ అమలు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం . కాగా లాక్ డౌన్ విధింపుపై తనదైన రీతిలో వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు . తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు . ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ "ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ విధించడం ప్రభుత్వాలు చేస్తున్న చారిత్రాత్మక తప్పిదం అవుతుందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సుమారు 90 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్ విధించారు. కానీ ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెట్టి.. జనజీవనాన్ని స్తంభిపచేయడం అన్నది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఈ 90 రోజుల పాటు మీరు విధించిన లాక్ డౌన్లో.. మెడికల్ రిసోర్స్ అన్ని కూడా సమకూర్చుకుని.. సెంట్రల్ గవర్నమెంట్ అయినా.. స్టేట్ గవర్నమెంట్స్ అయినా కరోనాను జయించేందుకు శక్తులన్నింటిని కూడగట్టుకుని సిద్ధంగా ఉండాలి.అలా కాదని ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ విధిస్తున్నామంటూ ప్రకటిస్తే మాత్రం అది చారిత్రాత్మక తప్పిదం అవుతుందని అన్నారు.ప్రజలందరూ కూడా 90 రోజుల పాటు వారి జీవితాలను వదిలేశారు. ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. లాక్ డౌన్ సమయంలో వీరందరూ కూడా చాలా నష్టపోయారు. మూగజీవాల పరిస్థితి అయితే దయనీయంగా మారింది.అలాంటిది ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన వస్తే మాత్రం దాన్ని విరమించుకోవాలి" అని నాగబాబు అన్నారు