లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రకుల్ తాజాగా మాట్లాడుతూ.. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ముంబైలోనే ఉండిపోయానని.. పరిస్థితులు కుదుటపడిన తర్వాత హైదరాబాదుకు వస్తానని తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ఇక్కడ దక్షిణాదిలో తాను పూర్తి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయని.. ఓ హిందీ సినిమాకు కూడా సంతకం చేశానని తెలిపింది. ఇక తన జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలనీ.. ఆ లక్ష్యంతో తొమ్మిదేళ్ల క్రితం అమ్మానాన్నలను వదిలి.. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పింది. అయితే ఈ కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా కాలం తర్వాత ఇప్పుడు అమ్మానాన్నలతో క్వాలిటీ టైమ్ను గడుపుతున్నానని తెలిపింది. అమ్మ నాన్నలతో ఉండడంతో మరోసారి బాల్యంలోకి అడుగుపెట్టినట్టు ఉందని.. తాను చేసిన వంటను రుచి చూసి చాలా బాగుందని అమ్మానాన్నలు మెచ్చుకుంటున్నారని.. ఇది ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపింది.ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే ఈ భామ తెలుగులో నితిన్ సరసన చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2లో సినిమాలో నటిస్తోంది. మరోవైపు హిందీలో అర్జున్ కపూర్ హీరోగా వస్తోన్న ఓ రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది.