ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి - రోజా మళ్ళీ కలిసి నటించబోతున్నారా..?

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 05, 2020, 09:46 AM



వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా, మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి వెండితెరపై కనిపించబోతున్నారా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మలయాళంలో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ రీమేక్ చిత్రంలో నటించనున్నాడు. ఇప్పటికే రాంచరణ్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ను తీసుకున్నారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను సాహూ దర్శకుడు సుజిత్ కు అప్పగించారు. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో రోజా ను పెట్టాలని చిరు సుజిత్ కు చెప్పాడట. ఇప్పటికే రోజాతో సంప్రదింపులు కూడా జరిగాయట. అన్నీ ఓకే అయితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com