ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రేజీ ఆఫర్‌ వద్దనుకున్న రష్మిక

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 10:59 AM



రష్మిక మందన్న హిందీలో వచ్చిన క్రేజీ ఆఫర్‌ను ఒదులుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ యేడాది ఈ భామ.. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత ఇపుడు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో కథానాయికగా యాక్ట్ చేస్తోంది. ఐతే.. రష్మికకు బాలీవుడ్‌లో ఓ సినిమాలో మంచి ఛాన్స్ వచ్చినా..ఎందుకో యాక్సాప్ట్ చేయలేదు. గతేడాది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. రీసెంట్‌గా అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో హీరోగా నటించిన షాహిద్ కపూర్ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇపుడు అదే ఊపులో తెలుగులో హిట్టైయిన ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పాడు.  తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీలో ఈ సినిమాను అల్లు అరవింద్‌తో కలిసి దిల్ రాజు  నిర్మిస్తున్నాడు.


ఇక హిందీలో షాహిద్ కపూర్ సరసన రష్మిక మందన్నను ఎంపిక చేసారు. కానీ రష్మిక మందన్న ఇప్పటికే చేతిలో ఉన్న సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ  సినిమా హిందీ రీమేక్ నుంచి తప్పుకుంది. ఇపుడు హిందీ రీమేక్‌లో మృణాల్ ఠాగూర్ నటించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా హిందీలో వచ్చిన క్రేజీ ఆఫర్‌ను రష్మిక అలా మిస్ చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com