నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘వి’. నాని హీరోగా నటించిన 25వ చిత్రం. ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. థియేటర్స్ మూతపడి మూడు నెలలు అయ్యాయి. ఈ తరుణంలో కొన్ని సినిమాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరికొన్ని థియేటర్స్ ఓపెన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ‘వి’ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయడానికి కొన్ని డిజిటల్ సంస్థలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిర్మాత దిల్రాజు ఈ చిత్రాన్ని థియేటర్స్లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే డిజిటల్ సంస్థలు భారీ ఆఫర్స్ చేస్తున్నాయి. తాజాగా తెలుగు ఓటీటీ ఆహా నుండి కూడా దిల్రాజుకు భారీ ఆఫర్ వచ్చిందని వార్తలు వినపడుతున్నాయి. ‘వి’ సినిమా హక్కుల కోసం అల్లు అరవింద్ రూ.30 కోట్లు ఆఫర్ను దిల్రాజు ఇస్తానని అన్నారట. ఇప్పటికే విడుదలకు ఆలస్యమవుతున్న సినిమా. థియేటర్స్ విషయంలో క్లారిటీ రావడం లేదు. మరి దిల్రాజు అరవింద్ ఆఫర్కు ఒప్పుకుంటారేమో చూడాలి.