ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యంగ్ హీరో అల్లు శిరీష్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 01:26 PM



రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో విశ్వ‌క్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన ఇంటి గార్డెన్ లో మొక్కలు నాటిన హీరో అల్లు శిరిష్. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్ప‌డున్న జీవిన‌విధానంలో ప‌ర్య‌వ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అత్యంత అవ‌స‌రం. అందుకే విధిగా మ‌నంద‌రం స్వ‌చ్ఛందంగా మొక్క‌లు నాటాల‌ని కోరుతున్నాను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విశ్వ‌క్ సేన్ నాకిచ్చిన ఛాలెంజ్ ను స్వీక‌రించి నా మేన‌ల్లుడు ఆర్నావ్ మేన‌కోడ‌ల్లు అన్విత‌, స‌మారా, నివ్రితిల‌ను ఈ కార్య‌క్ర‌మానికి నామినేట్ చేస్తున్నాను. రానున్న కొత్త త‌రానికి చెట్ల‌ను, ఏ విధంగా నాటాలి, పెంచాల‌నే విష‌యం తెలియ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని అన్నారు. అందుకే త‌న మేన‌ల్లుడు, మేన‌కోడ‌ల్ల‌కి ఈ ఛాలెంజ్ స్వీక‌రించాల్సిందిగా నామినేట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. అల్లు శిరీష్ ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి సినిమాకి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌ణ త్వ‌ర‌లోనే రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com