ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి రెండో సినిమాగా మహా సముద్రం పేరుతో ఓ యాక్షన్ మూవీని ప్లాన్ చేశాడు. అయితే చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ సినిమాకు శర్వానంద్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.సినీ ఇండస్ట్రీ సక్సెస్ వెంటే పరిగెడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఏ దర్శకుడికైనా ఒక్క హిట్ వస్తే చాలా వెంటనే హీరోలు నిర్మాతలు క్యూ కట్టేస్తారు. కానీ అన్ని సందర్భాల్లో ఇలా జరగదు. ఓ బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఓ డైరెక్టర్ రెండో సినిమాను ప్రారంభించడానికి పెద్ద యజ్ఞమే చేస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా 'మహా సముద్రం' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా రాశిఖన్నాను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.