కరోనాతో తెలుగు గాయకుడు నిస్సార్ మరణించారు. ఆయన ఇటీవల కరోనా బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచారు. నిస్సార్ ఇటీవలే కరోనా పై పాట రాశారు. దానిని గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ పాడారు. మార్చి నెల చివరిలో ఈ పాట విడుదలైంది. ఈ పాటకు విశేష ప్రేక్షకాధరణ లభించింది. నిస్సార్ స్వస్థలం యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం. నిస్సార్ ప్రస్తుతం ఆర్టీసీలో కంట్రోలర్ గా పని చేస్తూ జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నాడు. ‘కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన. కరోనా కరోనా నిన్ను మట్టికరిపిస్తాం 130 కోట్ల జనం సరేనా!!’అంటూ కరోనాపై కలం గురిపెట్టి ఆయన పాట రాశారు. ఆయన పలు చిత్రాలకు కూడా పాటలు రాశారు. ఆయన మరణంతో విషాదం నెలకొంది.