మజిలీ సినిమాతో చానాళ్ళ తరువాత సూపర్ హిట్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు. శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా దెబ్బ గట్టిగా ఉన్నా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా తమ షూట్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి ఆపక తప్పని పరిస్థితి. అయితే ఆ విషయం ఎలా ఉన్నా ఇప్పుడు నాగచైతన్య తదుపరి ప్రాజెక్ట్ అంటూ ఒక సినిమా మీద చర్చ జరుగుతోంది. ఇప్పటికే మనోడు బంగార్రాజు అనే సినిమా చేస్తున్నాడు, నాగార్జున లీడ్ రోల్ లో నటించే ఈ సినిమాలో ఈయన కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పరశురామ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది.
ఇక ఇప్పుడు మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా చేస్తున్నట్టు దర్శకుడు విక్రమ్ క్లారిటీ ఇచ్చారు. థాంక్యూ పేరిట ఒక సినిమా చైతూతో ప్లాన్ చేశామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందన్న వార్త నిజం కాదని, ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకుందామని దిల్ రాజు సిఫార్సు చేయగా దానికి నాగ చైతన్య ఆమె వద్దు.. రష్మిక అయితే బెటరని చెప్పాడని అంటున్నారు.
అయితే ఇలా ఎప్పుడూ చైతూ హీరోయిన్ కోసం పట్టు బట్టినట్టు వార్తల్లో లేదు. మరి ఇప్పుడు ఈ పుకారు కూడా ఎందుకొచ్చిందో తెలీదు. ఎవరైనా ఏ చిన్న సాయం చేసినా దానికి కృతజ్ఞత వ్యక్తం చేయడమన్నది మనిషి కనీస కర్తవ్యం’ అని నమ్మే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథతో ఈ ‘థాంక్యూ’ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు.