ట్రెండింగ్
Epaper    English    தமிழ்

400 కుటుంబాలకు సోనూ సూద్ సాయం

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 09:21 PM



లాక్ డౌన్ సమయంలో వివిధ ప్రమాదాలలో మరణించిన, గాయపడ్డ వలన కార్మికుల కుటుంబాలకి సోనూ సూద్ సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని సోనూ సూద్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆయన చేసిన సామాజిక సేవలు వెలకట్టలేనివి. వైద్యుల కోసం హోటల్ కేటాయించిన సోనూ సూద్, వలస కార్మికులని వారి సొంత గ్రామాలకి తరలించేందుకు బస్సులు, రైళ్ళు, చార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసాడు. సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరిని వారి గూటికి చేర్చడంపై సోనూ సూద్ చేసిన సేవకు దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com