త్రివిక్రమ్ ఇప్పుడే అల వైకుంఠపురంలో వంటి పెద్ద హిట్ ఇచ్చాడు. దీనితో ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 2021 వేసవికి ఈ సినిమా విడుదల అవుతుందని అప్పట్లో చిత్రబృందం చెప్పుకొచ్చింది. అయితే కరోనా కారణంగా అప్పటికి సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం కూడా కనిపించడం లేదు.
త్రివిక్రమ్ ఇప్పుడే అల వైకుంఠపురంలో వంటి పెద్ద హిట్ ఇచ్చాడు. దీనితో ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. దీనితో ఈ లాక్ డౌన్ బ్రేక్ ని పూర్తిగా వాడుకుని త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పక్కాగా చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ బాలీవుడ్ యువ నటిని మెయిన్ హీరోయిన్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట.
ఎప్పటిలాగే, అతను రెండవ హీరోయిన్ కోసం కూడా తెలిసిన ముఖాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ పూర్తి చేసేలోగా త్రివిక్రమ్ మధ్యలో వేరే సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే అటువంటి ఆలోచన ఏదీ ఆయన చెయ్యడం లేదని సమాచారం. కరోనా బ్రేక్ కారణంగా ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.