టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద కొందరు దుండగులు తీవ్ర భయాందోళనలు రేకెత్తించిన ఘటన కలకలం రేపింది. హైదరాబాదు లోని మోహన్ బాబు నివాసంలోకి శనివారం రాత్రి ఓ ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు మిమ్మల్ని వదిలేది లేదంటూ హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఈ ఘటన పై మోహన్ బాబు పహాడి షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. ఏపీ 31 ఏఎస్ 0004నెంబర్ గల ఇన్నోవా కారులో నలుగురు దుండగులు వచ్చినట్టు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. మరి వీరు మోహన్ బాబును ఎందుకు హెచ్చరించారు అనే విషయం విచారణలో తెలియాల్సి ఉంది.