టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్యకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరసగా కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు తేజ, ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి, సింగర్ స్మిత కరోనా బారిన పడిన పడ్డారు.