ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ బాబుతో ఉన్న తన మనవడి ఫోటో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రఘురామకృష్ణ..

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 09, 2020, 01:33 PM



టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇవాళ 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు బర్త్ డే గ్రీటింగ్స్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, మహేశ్ బాబుతో తన మనవడు తీయించుకున్న ఫొటోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు.


రఘురామకృష్ణరాజు మనవడు కారు బానెట్ పై ఠీవీగా కూర్చుని ఉండగా, మహేశ్ బాబు పక్కనే చిరునవ్వుతో నిల్చుని ఉండడం ఆ ఫొటోలో చూడొచ్చు. కాగా, మహేశ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలతోనే కాకుండా, తన వ్యక్తిత్వంతోనూ అనేకమందిని అభిమానులుగా మార్చుకున్న మహేశ్ బాబుకు ఈ స్థాయిలో గ్రీటింగ్స్ వస్తుండడం ఆశ్చర్యమేమీ కాదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com