ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్షన్లో 'కే.జి.ఎఫ్' టీం..

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 12, 2020, 03:50 PM



కన్నడ సినిమా అయినప్పటికీ.. 'కె.జి.ఎఫ్' చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో యష్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.'బాహుబలి' తరువాత పాన్ ఇండియా లెవల్లో విజయం సాధించిన సినిమా 'కె.జి.ఎఫ్ చాప్టర్1' కావడంతో 'కె.జి.ఎఫ్2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్టే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం ప్లానింగ్ మొత్తం తారుమారు అయిపోయిందని టాక్.! ముఖ్యంగా విలన్ అధీర పాత్ర పోషిస్తోన్న సంజయ్ దత్ పార్ట్ చాలా బ్యాలన్స్ ఉందట. అయితే ఆయన క్యాన్సర్ కు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ కోసం అర్జెంటుగా అమెరికా వెళ్లాల్సి ఉందట.
ఆయన తిరిగి రావడానికి 4 నెలల నుండీ 6 నెలల వరకూ టైం పట్టొచ్చని వినికిడి. దాంతో ఇప్పుడు 'కె.జి.ఎఫ్' టీం కు ఎక్కడ లేని టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం 2021 సంక్రాంతి వరకూ విడుదల అయ్యే అవకాశం లేదన స్పష్టమవుతుంది. కాబట్టి 2021 సమ్మర్ కు ఈ చిత్రం రెడీ అయినా గొప్ప విషయమే అని చెప్పాలి. ఒకరకంగా కె.జి.ఎఫ్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com