రష్మిక మందన టాలివుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తెలుగులో ఇప్పటివరకు చేసింది ఆరు సినిమాలే అయినా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో అగ్ర స్థానంలో నిలిచింది. టాలివుడ్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలోనూ ఈ లక్కీ బ్యూటీ కూడా ఒకరంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
తాజాగా టాలివుడ్లో ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే రష్మిక మందన్న హైదరాబాద్లోని గచిబౌలి ప్రాంతంలో ఒక లగ్జరీ ఫ్లాట్ కొన్నది అని. ఈ వార్తని రష్మిక ఇంకా ధృవీకరించనప్పటికీ, ఇదే నిజమని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ కన్నడ బ్యూటీకి టాలీవుడ్లోనే ఎక్కువ అవకాశాలు వస్తుండటంతో ఇక్కడి సినిమాలు చేయడానికి వీలుగా ఇక్కడే ప్రాపర్టీపై ఇన్వెస్ట్మెంట్ పెట్టిందనేది సదరు వార్తల సారాంశం.
ప్రస్తుతానికి, రష్మిక 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ చిత్రానికి కూడా రష్మిక భారీ రెమ్యునరేషన్ తీసుకుంది అని సమాచారం.