సిద్ధార్థ్ అనగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తుకొచ్చే సినిమా 'బొమ్మరిల్లు'. అంతకు ముందు బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలు సిద్ధార్థ్కు హీరోగా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత సిద్ధార్థ్ చేసిన తెలుగు సినిమాలేవీ ఆ రేంజ్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. 2013లో జబర్దస్త్, బాద్షా(అతిథి పాత్ర)లో సిద్ధార్థ్ నటించారు. తర్వాత గృహం వంటి అనువాద చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ.. స్ట్రయిట్ తెలుగు సినిమాలో మాత్రం నటించనేలేదు. దాదాపు ఏడేళ్ల గ్యాప్తో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను పకలరించనున్నారు. వివరాల్లోకెళ్తే.. 'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'మహాసముద్రం'. ఇందులో ఇద్దరు హీరోలు. ఇప్పటికే నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ శర్వానంద్ పేరుని అధికారికంగా ప్రకటించిన సంతి తెలిసిందే. లేటెస్ట్గా సిద్ధార్థ్ కూడా ఇందులో హీరోగా నటిస్తారని ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.