`ఆర్ఎక్స్100` తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు అజయ్ భూపతి తన రెండో సినిమా `మహాసముద్రం`ను త్వరలో పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమాను నిర్మించేందుకు అనిల్ సుంకర ముందుకు వచ్చారు. మల్టీ స్టారర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరో శర్వానంద్ ఒక కథానాయకుడిగా ఫిక్స్ అయ్యాడు.
మరో హీరోగా సిద్ధార్థ్ను ఎంపిక చేసినట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సినిమాలో సమంతను హీరోయిన్గా తీసుకోవాలని మొదట్లో అనుకున్నారు. ఈ సినిమాలో నటించేందుకు సమంత కూడా అంగీకరించింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి సమంత తప్పుకుంది. కీర్తి సురేష్, సాయిపల్లవి పేర్లను కూడా పరిశీలించారు. చివరకు ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ను ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోందట.