ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనివార్య కారణాల వల్ల తప్పుకున్న సమంత.. ఆ ఛాన్స్ కొట్టేసిన ఐశ్వర్య..

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 11:55 AM



`ఆర్ఎక్స్100` తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు అజయ్ భూపతి తన రెండో సినిమా `మహాసముద్రం`ను త్వరలో పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమాను నిర్మించేందుకు అనిల్ సుంకర ముందుకు వచ్చారు. మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరో శర్వానంద్ ఒక కథానాయకుడిగా ఫిక్స్ అయ్యాడు. 


మరో హీరోగా సిద్ధార్థ్‌ను ఎంపిక చేసినట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని మొదట్లో అనుకున్నారు. ఈ సినిమాలో నటించేందుకు సమంత కూడా అంగీకరించింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి సమంత తప్పుకుంది. కీర్తి సురేష్, సాయిపల్లవి పేర్లను కూడా పరిశీలించారు. చివరకు ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోందట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com