అనుష్క ప్రధాన పాత్ర పోషించిన 'నిశ్శబ్దం' ఎట్టకేలకు విడుదలవుతోంది. నేరుగా అమెజాన్ ప్రైమ్లో దర్శనమివ్వనుంది. 'నిశ్శబ్దం' విడుదల తేదీని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఇపుడు నేరుగా డిజిటల్ రిలీజ్ చేస్తుంది చిత్రబృదం.
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్తో సినిమా షూటింగ్స్తో పాటు థియేటర్స్ కూడా మూత పడ్డాయి. అయితే ఈ లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి.
అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక చిత్రం 'నిశ్శబ్దం'. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. క్రితి ప్రసాద్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్ అసోసియేషన్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని మొదట భావించారు. కానీ కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది.
ఇప్పటికే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇటీవల నాని 'V' చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఇదే బాటలో తెలుగులో చాలా సినిమాలు ఓటీటీలో విడుదలకానున్నాయి. అందులో భాగంగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమాకు కూడా మంచి డీల్ కుదిరిందట.. దీంతో ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు చిత్ర విడుదల తేదీని శుక్రవారం అమెజాన్ ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ప్రసారం కానున్నట్టు అమెజాన్ వెల్లడించింది.
సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన 'నిశ్శబ్దం'లో మాటలురాని, వినికిడి లోపం ఉన్న ఒక కళాకారిణిగా అనుష్క కనిపించనుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు అయిన ఆమె భర్త, అలాగే ఆమె ప్రాణ స్నేహితురాలు అదృశ్యం కావడం అనే అంశంపై ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్ దాదాపు 25 కోట్ల పెట్టి స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని సమాచారం అందుతోంది. ఈ చిత్రాన్ని డిజిటల్ ప్రీమియర్ గా వచ్చే అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి తేనున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓ ట్వీట్లో ప్రకటించింది.