టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో అహేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నిశ్శబ్దం'. ఈ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్లో 'నిశ్శబ్దం' సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అనుష్క శెట్టి తన ఇన్స్టాలో విడుదల తేదీని అనౌన్స్ చేసే ప్రోమోతో పాటు 'నీ సైలెన్సే నిన్ను కాపాడుతుంది' అనే మెసేజ్ను కూడా షేర్ చేశారు. తెలుగులో నిశ్శబ్దం, తమిళ, మలయాళ భాషల్లో సైలెన్స్ అనే పేరుతో సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమాను అమెరికాలో చిత్రీకరించారు. హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ ఈ చిత్రంలో భాగమయ్యారు.
మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే, మైఖేల్ హడ్సన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ.. కోవిడ్ ప్రభావంతో విడుదల వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడితే థియేటర్స్లోనే సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ థియేటర్స్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. దీంతో నిర్మాతలు సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారంటూ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. తాజాగా చిత్రయూనిట్ నిశ్శబ్దం విడుదలపై క్లారిటీ ఇచ్చేసింది.